చెన్నై: జోరు వానలతో వణికిపోతున్న తమిళనాడులో భూ ప్రకంపణలు వచ్చాయి. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు వెల్లూరులో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. వెల్లూరుకు 59 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 25 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని పేర్కొన్నది. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
గత శుక్రవారం మిజోరాంలో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. మిజోరాంలో శుక్రవారం ఉదయం 5.15 గంటలకు 6.1 తీవ్రతతో భూమి కంపించింది. అదేవిధంగా బంగ్లాదేశ్తోపాటు కలకత్తా, ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది.