భోపాల్ : మధ్య ప్రదేశ్లోని చింద్వారా లో గత ఏడాది వెల్లుల్లిని పండించి నష్టపోయిన రైతులు ఈసారి సంతోషంగా ఉన్నారు. కేజీ వెల్లుల్లి ధర రూ.500 పలుకుతుండటంతో సంతోషంతోపాటు దొంగల బెడద కూడా వారిని వేధిస్తున్నది.
ఎనిమిది గ్రామాల రైతులు అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను తమ పొలాల్లో అమర్చారు. దీంతో దొంగలను నిరోధించడంతోపాటు కూలీల పనితీరును కూడా వీరు పర్యవేక్షించగలుగుతున్నారు. పొలంలో అనుమానాస్పద పరిస్థితులు ఉంటే అలారం మోగుతుందని రైతులు చెప్పారు.