భోపాల్: ఇసుక మాఫియా రెచ్చిపోయింది. (Sand Mafia) అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారిని ట్రాక్టర్తో తొక్కి చంపారు. మధ్యప్రదేశ్లోని షాహదోల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గోపాల్పూర్ ప్రాంతంలోని సోన్ నది సమీపంలో అక్రమంగా ఇసుకను తవ్వి రవాణా చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ అధికారులకు తెలిసింది. దీంతో శనివారం అర్ధరాత్రి వేళ ప్రసన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వ ఉద్యోగుల పెట్రోలింగ్ బృందం ఆ ప్రాంతానికి చేరుకుంది.
కాగా, ఒక ట్రాలీలో ఇసుకను అక్రమంగా అక్కడి నుంచి తరలిస్తున్న ట్రాక్టర్ను అడ్డుకునేందుకు అధికారి ప్రసన్ సింగ్ ప్రయత్నించాడు. అయితే డ్రైవర్ ఆ అధికారి మీదుగా ట్రాక్టర్ను నడిపి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన సింగ్ అక్కడికక్కడే మరణించాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రెవెన్యూ శాఖ అధికారి ప్రసన్ సింగ్ను ట్రాక్టర్తో తొక్కి హత్య చేసిన డ్రైవర్ను 25 ఏళ్ల శుభం విశ్వకర్మగా గుర్తించారు. ఆదివారం ఉదయం అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ట్రాక్టర్ యజమానిని కూడా గుర్తించినట్లు చెప్పారు.