ఇండోర్, మార్చి 11: మధ్యప్రదేశ్లోని ధర్ జిల్లాలో ఉన్న భోజ్శాల మందిరమా? మసీదా? సర్వే చేసి చెప్పాలని భారత పురావస్తు సంస్థ (ఏఎస్ఐ)ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. 11వ శతాబ్దపు నాటిదిగా భావిస్తున్న ఈ నిర్మాణంపై 6 వారాల్లోగా శాస్త్రీయ సర్వే నిర్వహించి, నివేదిక అందించాలని స్పష్టం చేసింది. భోజ్శాలను హిందువులు సరస్వతీదేవికి అంకితం చేసిన దేవాలయంగా భావిస్తారని హిందీ ఫ్రంట్ ఫర్ జస్టిస్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని ముస్లింలు కమల్ మౌలా మసీదు అని పిలుస్తారు. అయితే, ప్రస్తుతం ఈ నిర్మాణం ఏఎస్ఐ పరిధిలో ఉన్నది. ప్రతి మంగళవారం హిందువులు, శుక్రవారం ముస్లింలు ప్రార్థనలు చేసుకొనేందుకు 2003లో ఏఎస్ఐ అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హిందీ ఫ్రంట్ ఫర్ జస్టిస్ 2022లో పిల్ దాఖలు చేసింది. 1034లో అప్పటి ధర్ పాలకులు ఇక్కడ సరస్వతి విగ్రహాన్ని స్థాపించారని, 1857లో దాన్ని బ్రిటిష్వారు లండన్కు తీసుకెళ్లారని వాదించింది.