భోపాల్: ప్రభుత్వ అధికారిణి అయిన భార్యను భర్త హత్య చేశాడు. (MP Bureaucrat killed by husband) ప్రభుత్వ రికార్డులు, బీమా, బ్యాంకు ఖాతాల్లో నామినీగా తనను పేర్కొనపోవడంతో గొంతు నొక్కి ఆమెను చంపాడు. అస్వస్థతకు గురై మరణించినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమెను హత్య చేసినట్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో బయటపడింది. మధ్యప్రదేశ్లోని దిండోరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 51 ఏళ్ల నిషా నపిట్ షాపురాలో మహిళా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా విధులు నిర్వహిస్తున్నది. మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమైన 45 ఏళ్ల మనీష్ శర్మతో 2020లో పెళ్లి జరిగింది.
కాగా, మనీష్ శర్మ తన భార్య నిషాను ఆదివారం దిండితో నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆమె అస్వస్థతకు గురైందంటూ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే నాలుగైదు గంటల ముందే ఆమె మరణించినట్లు డాక్టర్లు గ్రహించారు. ఆమె భర్తపై అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు నిషాను ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా తేలింది. రక్తం మరకలు ఉన్న నిషా దుస్తులు, బ్లాంకెట్లు, దిండిని వాషింగ్ మెషిన్లో మనీష్ శర్మ ఉతికినట్లు పోలీసులు గుర్తించారు. ఏ ఉద్యోగం లేని అతడు డబ్బులు కోసం భార్యను వేధిస్తున్నాడని నిషా కుటుంబం ఆరోపించింది. అలాగే ప్రభుత్వ రికార్డులు, ఇన్సూరెన్స్, బ్యాంక్ రికార్డులలో నామినీగా చేయనందుకు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో మనీష్ శర్మను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
🔸24 घण्टे के अंदर एसडीएम निशा नापित की सनसनी खेज/अंधी हत्या का डिण्डौरी पुलिस ने किया खुलासा
RM:https://t.co/hT9loRheZ7#JansamparkMP pic.twitter.com/lau7iMPkFL— PRO JS Dindori (@projsdindori) January 29, 2024