భోపాల్: కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దుచేసినట్లు ప్రకటించిన మరుసటి రోజే ఒక్కో రాష్ట్రం తమ స్టేట్ బోర్డుల పరిధిలోని పరీక్షలను కూడా రద్దు చేస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం 12వ తరగతి పరీక్షలను రద్దు చేయగా.. తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం చేసింది. రాష్ట్రంలో 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నామని స్వయంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ప్రకటించారు.