శ్రీనగర్ : పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్లో స్ధానిక యువతకు ఉగ్ర ముసుగు తొడుగుతున్నారని లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే వ్యాఖ్యానించారు. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు అలజడి రేపడం లేదని, ఇక్కడ స్దానిక యువతను ఉగ్రవాద ముఖాలుగా ముందువరుసలో నిలుపుతున్నారని చెప్పారు.
స్ధానికంగా ఉగ్రవాదుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఉగ్రవాదులు బయటపడుతున్నారని వారి కాంటాక్టులు బహిర్గతమవుతున్నాయని అన్నారు. భారత సరిహద్దు భద్రత పటిష్టంగా ఉందని చెప్పారు. ఈ ఏడాది సరిహద్దు వెంబడి కేవలం ఒక చొరబాటు ఘటన చోటుచేసుకోగా చొరబాబు యత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయని తెలిపారు.
మన ఉగ్రవాద వ్యతిరేక గ్రిడ్ను వారు అధిగమించలేరని స్పష్టం చేశారు. ఇక లష్కరే తోయిబా టెర్రరిస్ట్ యామిన్ యూసఫ్ భట్ను కుల్గాం పోలీసులు, భద్రతా దళాలు ఆదివారం అరెస్ట్ చేశాయి. ఉగ్రవాది నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.