న్యూఢిల్లీ : పోలింగ్ శాతాలను ప్రకటించడంలో ఎన్నికల సంఘం జాప్యంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తాయి. తొలి దశ ముగిసి 11 రోజులైనా, రెండో దశ ముగిసి నాలుగు రోజులైనా తుది పోలింగ్ శాతాలను ప్రకటించకపోవడంపై కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్ ఈసీని ప్రశ్నించాయి.
ఈ క్రమంలో మంగళవారం ఈసీ తుది పోలింగ్ శాతాలను విడుదల చేసింది. మొదటి దశలో 66.14%, రెండో దశలో 66.71 ఓటింగ్ నమోదైందని వెల్లడించింది.