Gautam Gambhir : భారత జట్టు మాజీ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ గౌతమ్ గంబీర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరో దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. గంబీర్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గంలో ఓటు వేశారు.
ఓటు వేసిన అనంతరం గంబీర్ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు అనేది ప్రజల శక్తి అని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్ల బీజేపీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని గంబీర్ చెప్పారు. కాగా సిట్టింగ్ ఎంపీ అయిన గంబీర్ ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీకి నిరాకరించారు.
#WATCH | BJP East Delhi MP and former India Cricketer Gautam Gambhir casts his vote for the sixth phase of #LokSabhaElections2024 at a polling station in Delhi. pic.twitter.com/1dNMGyCoUq
— ANI (@ANI) May 25, 2024