న్యూఢిల్లీ, డిసెంబర్ 1: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే కేంద్రం వంటగ్యాస్పై మోత మొదలుపెట్టింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్పై రూ.21 పెంచింది. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం ప్రకటించాయి. తాజా పెంపుతో 19 కేజీల సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,796.50, ముంబైలో రూ.1,749, చెన్నైలో రూ.1,968కి చేరింది.
గృహావసరాలకు వాడే ఎల్పీజీ సిలిండర్ ధరలు మాత్రం పెరగలేదు. వాణిజ్య సిలిండర్పై నవంబర్ 1న రూ.100 పెంచిన కేంద్రం.. అనంతరం నవంబర్ 16న రూ.57 తగ్గించింది. మరోవైపు, జెట్ ఇంధన ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 4.6 శాతం తగ్గించాయి.