బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో ఆ రాష్ట్రంలో విద్వేషం తుడిచిపెట్టుకుపోయిందని, ప్రేమే గెలిచిందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్గాంధీ అన్నారు. ఇవాళ బెంగళూరులోని కన్నడ కంఠీరవ స్టేడియంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం అదే వేదిక పైనుంచి రాహుల్గాంధీ కాంగ్రెస్ శ్రేణులను, కర్ణాటక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
బీజేపీ పాలనలో కర్ణాటకలో అవినీతి రాజ్యమేలిందని, ఇప్పుడు అవినీతికి తావులేని, ప్రజాసంక్షేమ ప్రభుత్వాన్ని మీరు చూస్తారని రాహుల్గాంధీ అన్నారు. బీజేపీలా హామీలు ఇచ్చి మాట తప్పడం కాంగ్రెస్ పార్టీ నైజం కాదని, తాము ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేరుస్తామని ఆయన చెప్పారు. మరికొన్ని గంటల్లో జరుగబోయే తొలి క్యాబినెట్ మీటింగ్లోనే 5 ప్రధాన హామీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు.