న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి పాట్నా వరకు.. దీపావళి సందర్భంగా ప్రత్యేక వందేభారత్ ఎక్స్ప్రెస్(Vande Bharat Express)ను నడుపుతున్నారు. అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే వందేభారత్ రైలుగా రికార్డు నమోదు అయ్యింది. ఇవాళ ఢిల్లీ నుంచి ఉదయం 8.25 నిమిషాలకు రైలు ప్రారంభమైంది. దాదాపు 994 కిలోమీటర్లు ఆ రైలు ప్రయాణం చేస్తుంది. సుమారు 11 గంటల 30 నిమిషాల పాటు జర్నీ ఉంటుంది. రాత్రి 8 గంటలకు వందేభారత్ ఎక్స్ప్రెస్ పాట్నా చేరుకుంటుంది. అర్రా, బుక్సర్, డీడీయూ, ప్రయాగ్రాజ్, కాన్పూర్ స్టేషన్లలో దీనికి స్టాప్లు ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఈ రైలు కేవలం బుధ, శుక్ర, ఆదివారాల్లో బయలుదేరుతుంది. ఇక పాట్నా నుంచి ఢిల్లీకి ఈ రైలు సోమ, గురు, శనివారాల్లో వెళ్తుంది. పాట్నా నుంచి ఉదయం 7.30 నిమిషాలకు బయలుదేరి, ఆ తర్వాత ఢిల్లీకి రాత్రి ఏడు గంటలకు చేరుకుంటుంది. ఈ రైలులో స్లీపర్క్లాసు సౌకర్యం లేదు.
దీపావళి స్పెషల్ వందేభారత్ ఎక్స్ప్రెస్లో ఏసీ చైర్ కార్ టికెట్ ధర 2,575 కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్కార్ టికెట్ ధర రూ.4655గా ఉంది. ఢిల్లీ నుంచి పుణెకు కూడా వందేభారత్ రైళ్లను నడపుతున్నారు. నవంబర్ 1, 3, 6 తేదీల్లో ఢిల్లీ నుంచి రైలు బయలుదేరుతుంది. మళ్లీ రిటర్న్ సర్వీసులు నవంబర్ 2, 4, 7 తేదీల్లో ఉంటాయి. గతంలో ఢిల్లీ నుంచి వారణాసి వరకు లాంగెస్ట్ వందేభారత్ రైలు నడిచింది. 771 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల్లో చేరుకున్నది. ఈ రూట్లో వందేభారత్ స్లీపర్ రైలును త్వరలో ప్రారంభించనున్నారు.