న్యూఢిల్లీ: లోక్సభ(lok sabha)లో ఇవాళ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అదానీ-హిండెన్బర్గ్(adani-hindenberg) అంశంపై జేపీసీతో దర్యాప్తు చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. వెల్లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం(rukus) నెలకొన్నది. మరో వైపు మంత్రి పీయూష్ గోయల్(piyush goyal) మాట్లాడుతూ.. భారత్ గురించి విదేశీ గడ్డపై రాహుల్(rahul gandhi) అనుచితంగా మాట్లాడారని, ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ విపక్ష సభ్యులు ఆందోళనలు విరమించకపోవడంతో.. స్పీకర్ బిర్లా(speaker om birla) సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.
రాజ్యసభ(rajya sabha)లోనూ విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో చైర్మెన్ జగదీప్ ధన్కర్ సభను 2 గంటల వరకు వాయిదా వేశారు.