Lok Sabha Elections | న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల తొలి దశ లో దాదాపు సగం స్థానాల్లో నేర చరితులే ఎ క్కువగా పోటీ పడుతున్నారని అసోసియేష న్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్విశ్లేషించింది. మొత్తం 102 స్థానాలకు గాను 42 సీట్లలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది నేర చరితులు ప్రధాన పార్టీల తరపున ఎన్నికల బరిలో నిలిచారని తెలిపింది.
1618 మంది ఎన్నికల అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించింది. అందులో 252 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని.. వారిలో 161 మందిపై తీవ్రమైన నేరాభియోగాలున్నాయని వెల్లడించింది. 35 మందిపై విద్వే ష ప్రసంగాల కేసులున్నాయని తెలిపింది. 41 శాతం సీట్లలో రెడ్ అలర్ట్ ప్రకటించారని చెప్పింది. 28 శాతం అభ్యర్థులు కోటీశ్వరులని ప్రకటించింది. ఆర్జేడీ, డీఎంకే, ఎస్పీ, టీఎంసీ అభ్యర్థుల్లో 40 శాతం మంది ఏదో ఒక నేరానికి పాల్పడిన వారేనని తెలిపింది.