Lok Sabha Elections | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 13వ తేదీ తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) వర్గాలు తెలిపాయి. ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు ఈసీ సభ్యులు వివిధ రాష్ర్టాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ పర్యటనలు ముగియగానే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు వెల్లడించాయి.
ఈసీ ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నది. త్వరలో ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్లో పర్యటించనున్నది. మార్చి 13 వరకు ఈ పర్యటనలు ముగియనున్నాయి. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించాలని ఈసీ నిర్ణయించింది. అభ్యర్థులు, వారి అనుచరులు ఎవరైనా సోషల్మీడియాలో తప్పుడు ప్రచారం చేసినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకొంటామని ఈసీ హెచ్చరించింది.