న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 మధ్యంతర బడ్జెట్కు లోక్సభ బుధవారం మూజవాణి ఓటుతో ఆమోదించింది. దీంతోపాటుగా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్కు సంబంధించిన రూ.1.8 లక్షల కోట్ల బడ్జెట్ను కూడా దిగువ సభ ఒకే చేసింది.
త్వరలో లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 1న రూ.47.66 లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్పై చర్చకు మంత్రి సీతారామన్ బుధవారం సమాధానం ఇస్తూ.. 2024-25లో ద్రవ్యలోటును జీడీపీలో 5.1 శాతానికి తగ్గిస్తామని పేర్కొన్నారు.