రాంచీ: భారత ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉన్నదని, అధికార బీజేపీ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నదని ప్రముఖ ఆర్థిక వేత్త జీన్ డ్రెజ్ ఆరోపించారు. ప్రస్తుత పరిణామాల మధ్య జరుగుతున్న లోక్సభ ఎన్నికలు దాదాపు రిగ్గింగ్ అయినట్టే అని పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ విపక్ష పార్టీలను పద్ధతి ప్రకారం లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు.
ప్రతిపక్ష నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు కొన్నేండ్లుగా శల్య పరీక్ష చేస్తూ, వేధిస్తున్నాయన్నారు. బీజేపీకి ముప్పు గా కనిపించే రాజకీయ నేతలు వేధింపులకు గురవుతున్నారని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో దాదాపు రిగ్గింగ్ జరిగినట్లేనని డ్రెజ్ వ్యాఖ్యానించారు.