న్యూఢిల్లీ, మే 16: కరోనా ఉద్ధృతి నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. గతంలో విధించిన లాక్డౌన్ నిబంధనలు నేటి (మే 17) తో ముగియనుండగా.. వాటిని మే 24 వరకు పొడిగిస్తున్నట్టు సీఎం చెప్పారు. గతనెలతో పోల్చితే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తున్నా ఇప్పుడే ఆంక్షలను సడలిస్తే తిరిగి వైరస్ విజృంభించే ముప్పు పొంచి ఉందన్నారు. ఢిల్లీతో పాటు హర్యానా, జమ్ముకశ్మీర్లోనూ లాక్డౌన్ తరహా ఆంక్షలను ఈనెల 24 దాకా పొడిగిస్తూ అక్కడి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక పంజాబ్లో కొవిడ్ కట్టడికి విధించిన నిబంధనలు ఈనెల 31 దాకా అమల్లో ఉంటాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తెలిపారు.