రాయ్పూర్: ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు బయటపడ్డాయి. జాష్పూర్లో ఇవాళ జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షుడు పవన్ అగర్వాల్ మాట్లాడుతుండగా పక్కనున్న ఓ వ్యక్తి ఆయనను నెట్టేశాడు. దాంతో అగర్వాల్ మనుషులు, అతని వ్యతిరేకులు, బౌన్సర్లు అంతా స్టేజీపైకి పరుగు తీయడంతో కాసేపు పరిస్థితి గందరగోళంగా మారింది. గొడవ పెద్దది కావడంతో వేదికపై ఉన్న సీనియర్ నేతలు లేచి వెళ్లిపోయారు. పవన్ అగర్వాల్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఒక మంత్రి తరఫున మాట్లాడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
అనంతరం ఈ ఘటనపై మాట్లాడిన పవన్ అగర్వాల్.. మంత్రి టీఎస్ సింగ్ డియో గత రెండున్నర సంవత్సరాలుగా సీఎం పదవి కోసం ఎదురుచూస్తున్నాడని, అందువల్ల ప్రస్తుత సీఎం భూపేశ్ భగేల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు. డియో, భగేల్ కలిసి పనిచేసినప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేనేలేదని వ్యాఖ్యానించారు. ఆ ఇద్దరి కృషి వల్లనే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఇదే విషయం స్టేజీ మీద మాట్లాడుతుండగా స్థానిక ఎమ్మెల్యే కున్కురి మనుషులు తనపై దాడి చేశారన్నారు.