Liquor shops : పండుగలు, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లోని కొన్ని తేదీలలో ఢిల్లీలో లిక్కర్ దుకాణాలు మూసి వేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీచేసింది. దేశ రాజధాని ఢిల్లీలో లోక్సభ ఎన్నికల రెండో విడతలో పోలింగ్ జరగనుంది. రెండో విడత ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 26న నిర్వహించనున్నారు.
అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రంజాన్, శ్రీరామనవమి సహా పలు పండుగలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా తేదీల్లో లిక్కర్ షాపులను మూసి ఉంచాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది. ఆ మేరకు ఎక్సైజ్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల ప్రకారం.. ఏప్రిల్ 26న లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ నేపథ్యంలో ఏప్రిల్ 24న సాయంత్రం 6 గంటల నుంచి 26న సాయంత్రం ఆరు గంటల వరకు వైన్షాపులను మూసివేస్తారు.
అదేవిధంగా రంజాన్ పండుగ నేపథ్యంలో ఏప్రిల్ 11న కూడా ఢిల్లీలో లిక్కర్ షాపులను మూసివేస్తారు. ఏప్రిల్ 17న శ్రీరామనవమి, ఏప్రిల్ 21న మహవీర్ జయంతి సందర్భంగా కూడా వైన్షాపులు మూసివుంటాయి. ఇక మే నెల 23న బుద్ధపూర్ణిమ నేపథ్యంలో లిక్కర్ షాపులను మూసివేయనున్నారు. అదేవిధంగా బక్రీద్ పండుగ సందర్భంగా జూన్ 17న కూడా లిక్కర్ షాపులు మూతపడనున్నాయి.