న్యూఢిల్లీ, మార్చి 19: కేంద్రంలోని బీజేపీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఒక రాజకీయ ఆయుధంగా మారిందని ఆప్ నేతలు మండిపడ్డారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ కీలక నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ఇవ్వడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందంటూ ఈడీ చేసిన ప్రకటనను ఢిల్లీ మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్ తీవ్రంగా ఖండించారు. ఈడీ చేస్తున్న వాదనను గత ఏడాది ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చిందని, ఆరోపణలకు తగిన ఆధారాలను దర్యాప్తు సంస్థ సమర్పించలేదన్న విషయాన్ని కోర్టు స్పష్టం చేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మంత్రి ఆతిశీ మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను పాల్గొనీయకుండా చేయాలని లక్ష్యంగా చేసుకొన్నదని ఆరోపించారు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన, అమలును తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు ఆప్ అగ్ర నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ఇవ్వడంలో ఇతరులతో కలిసి కవిత భాగస్వామ్యమయ్యారని ఈడీ సోమవారం ప్రకటనలో ఆరోపించింది. ఈడీ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఆప్ నేత ఆతిశీ.. ఈడీ ఒక కేంద్ర దర్యాప్తు సంస్థగా కాకుండా ఒక రాజకీయ పార్టీగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ 2023, అక్టోబర్ 30న సు ప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ క న్నా జారీచేసిన ఉత్తర్వులను ప్రస్తావించా రు. రూ.100 కోట్లు చేతులు మారాయని చెప్తున్న దానికి ఈడీ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని జడ్జి స్పష్టం చేశారని పేర్కొన్నారు. సోమవారం ఒక కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో ఈడీ అధికారులు ఒక రో జంతా ఉన్నారని, ఈ విధంగా రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా కథనాలు సృష్టించడం, వారి పరువు భంగం కలిగేలా చేయ డం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
తమకు రాజకీయంగా ముప్పుగా ఉన్న ప్రత్యర్థులను కేంద్రంలోని అధికార బీజేపీ అరెస్టులు చేయిస్తున్నదని, జైల్లో పెట్టిస్తున్నదని సౌరభ్ భరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేశా రు. రష్యా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైన పుతి న్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్లను ఈ సందర్భంగా ప్రస్తావించారు. రష్యాలో పుతిన్ తన రాజకీయ ప్రత్యర్థుల ను అడ్డు తొలగించుకొన్నారని, ప్రధాన ప్ర త్యర్థిని జైల్లో పెట్టారని, ఆయన ఇటీవల చనిపోయారని పేర్కొన్నారు. ఉత్తర కొరియాలో కిమ్ ఎన్నికలు నిర్వహించారని, ఎ న్నికల తర్వాత తనకు తానే విజేతగా ప్రకటించుకొన్నారని, మన దేశంలోనూ ఇదే ప రిస్థితి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
కేజ్రీవాల్ను చూసి బీజేపీ భయపడుతున్నదని, ఆయన సంధిస్తున్న ప్రశ్నలు ఆ పార్టీకి అసౌకర్యంగా మారాయని సౌరభ్ భరద్వాజ్ అన్నారు. ‘మా కీలక నేతలను జైల్లో పెట్టారు. ఇప్పుడు మా అగ్ర నేతను కూడా జైల్లో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసు పేరుతో ఈడీ చేస్తున్న దర్యాప్తు ఒట్టి బూటకమని అన్నారు. 2022లో కేసు నమోదు చేయగా.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 245 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదా లు చేశారని, 15 మందిని అరెస్టులు కూడా చేశారని, అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా ఈడీ రికవరీ చేయలేకపోయిందని పేర్కొన్నారు.