న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: పదేండ్లు జైలు శిక్ష పూర్తి చేసుకొని, సమీప భవిష్యత్తులో హైకోర్టులో అప్పీల్ విచారణకు రాని పక్షంలో సదరు జీవిత ఖైదీలను బెయిల్పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే బలమైన కారణాలు ఉంటే బెయిల్ నిరాకరించొచ్చని తెలిపింది. వివిధ హైకోర్టుల్లో అప్పీళ్లు పెండింగ్లో ఉన్న పలువురి ఖైదీలకు సంబంధించిన పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది.
వివిధ హైకోర్టుల్లో సుమారు 5,740 అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయని అమికస్ క్యూరీ గౌవర్ అగర్వాల్ కోర్టుకు తెలిపారు. ఖైదీలు ఇప్పటికే 14 ఏండ్లు జైలు శిక్ష పూర్తి చేసుకొని ఉంటే, వారి ముందస్తు విడుదలను పరిశీలించేందుకు సంబంధిత ప్రభుత్వాలకు పంపాలని కోర్టు సూచించింది.