డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ నూతన గవర్నర్గా ఆర్మీ మాజీ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్సింగ్ ( Gurmit Singh ) ప్రమాణస్వీకారం చేశారు. ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్భవన్లో సింపుల్గా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి, ఆయన మంత్రివర్గ సహచరులు, ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రెటరీ, డీజీపీ అశోక్ కుమార్ తదితర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
మూడేండ్ల పదవీకాలం మిగిలి ఉండగానే బేబీ రాణి మౌర్య రాజీనామా చేయడంతో ఉత్తారఖండ్ గవర్నర్ పోస్టు ఖాళీ అయ్యింది. దాంతో ఆమె స్థానంలో గుర్మీత్ సింగ్ను నూతన గవర్నర్గా నియమించారు. మాజీ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్సింగ్ ఆర్మీలో రిటైర్ అయ్యే సమయానికి డిప్యూటీ చీఫ్ స్థాయిలో పనిచేశారు.