ముంబై: దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికలు పెట్టాలని సీఎం ఏక్నాథ్ షిండే, బీజేపీని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే సవాల్ చేశారు. షిండే తిరుగుబాటుతో శివసేనలో నెలకొన్న సంక్షోభం, అనంతరం మహారాష్ట్రలో చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై ఆయన స్పందించారు. దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికలు పెట్టాలని, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ప్రజలే తన ఓటు రూపంలో తుది తీర్పు చెప్తారని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఠాక్రే విమర్శలు చేశారు. దేశంలో బరితెగింపు, నిస్సిగ్గు రాజకీయాలు జరుగుతున్నాయని, వీటిని మోదీ ఆపాలని అన్నారు.