ముంబై: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (Lata Mangeshkar) అభిమానులకు శుభవార్త. ఆమె కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోప్ ప్రకటించారు. ఈ నెల 8న కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆమె ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తాజాగా ఆమె కరోనా నుంచి కోలుకున్నారని, నిమోనియా నుంచి కూడా బయటపడ్డారని మంత్రి రాజేష్ తెలిపారు.
లతాజీకి చికిత్స అందిస్తున్న వైద్యులతో తాను మాట్లాడనని, ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని చెప్పారన్నారు. గత 15 రోజులుగా ఆమె వెంటీలేటర్ ఉన్నారని, ప్రస్తతం ఆ అవసరం లేదని, ఆక్సిజన్ మాత్రమే అందిస్తున్నారని తెలిపారు. కళ్లు తెరచి డాక్టర్లతో మాట్లాడుతున్నారని వెల్లడించారు. ఇప్పటికీ వీక్గానే ఉన్నారని, ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. కానీ ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గానే ఉందని, చికిత్సకు సహకరిస్తున్నారని మంత్రి రాజేశ్ తోప్ తెలిపారు.