Amarnath Yatra | శ్రీనగర్ : ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు ఉగ్రదాడుల ప్రమాదం పొంచి ఉన్నది. ఉగ్రవాదులు వాహనంలో అమర్చిన మందుపాతరలతో తీర్థయాత్రను లక్ష్యంగా చేసుకోవచ్చని భద్రతా ఏజెన్సీలకు సమాచారం అందింది. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఇలా దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
శనివారం భద్రతా ఏజెన్సీలు దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాకు చేరుకున్నాయి. మందుపాతరలు, బాంబులు, గ్రెనేడ్లతో దాడులు జరిగే పరిస్థితి ఉంటే ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై చర్చించారు.