న్యూఢిల్లీ : బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం చాలా మెరుగుపడిందని, కిడ్నీ సంబంధిత సమస్యలున్నాయని ఆయన తనయ మిసా భారతి తెలిపారు. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఐసీయూ నుంచి ప్రైవేటు వార్డుకు తరలించారని పేర్కొన్నారు. లాలూ ఈ నెల 3న తన నివాసంలో మెట్లపై నుంచి పడిపోయారు. దీంతో కుడి భుజానికి, వెన్నుకు గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆయనను ఎయిమ్స్కు తరలించగా.. చికిత్స పొందుతున్నారు.