లక్నో : లఖింపూర్ ఖేరి హింస కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్ను అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్ మంగళవారం తోసిపుచ్చింది. లఖింపూర్ ఖేరి హింసాకాండ కేసులో ఆశిష్ మిశ్రా గత ఏడాది అక్టోబర్లో అరెస్ట్ అయ్యారు.
ఆశిష్ బెయిల్ పిటిషన్పై జులై 15న వాదనలు ముగిసిన అనంతరం తీర్పును కోర్టు రిజర్వ్లో ఉంచింది. ఆందోళన చేపట్టిన రైతుల మీదుగా ఎస్యూవీ దూసుకెళ్లిన అనంతరం చెలరేగిన అల్లర్లలో ఎనిమిది మంది మరణించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో మరణించిన వారిలో నలుగురు బీజేపీ కార్యకర్తలతో పాటు నలుగురు రైతులున్నారు.