శ్రీనగర్: వాస్తవాధీన రేఖ వద్ద కొన్నేళ్ల నుంచి ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. భారత్, చైనా బలగాల మధ్య అక్కడ ఘర్షణ జరుగుతోంది. అయితే తాజాగా ఓ కొత్త వీడియో రిలీజైంది. వివాదాస్పద ఎల్ఏసీ వద్ద లడాఖ్ గొర్లకాపరులు(Ladakh Shepherds) తమ గొర్లను మేతకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఉన్న చైనా సైనికులు అడ్డుకున్నారు. అయితే ఆ గొర్లకాపరులు చైనా సైనికుల్ని ధైర్యంగా ఎదురించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.
2020లో జరిగిన గాల్వాన్ ఘటన తర్వాత ఎల్ఏసీ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అయితే పీఎల్ఏ దళసభ్యులను లడాఖ్ గొర్లకాపరులు ఎదురించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. గత మూడేళ్ల నుంచి ఎల్ఏసీ వద్ద గొర్లు మేపడాన్ని ఆపేశారు. అయితే తొలిసారి అక్కడ మళ్లీ గొర్లను మేపారు. తమ హక్కులను తాము వాడుకుంటున్నామని, మీరు వెనక్కి వెళ్లాలని ఆ గొర్లకాపరులు చైనా సైనికులను ఎదురించారు. పాన్గాంగ్ సరస్సు ఉత్తర తీరం వద్ద ఈ ఘటన జరిగింది.
Here is the video of the local #Ladakhi shepherds engaging the chinese #PLA most evidently in #easternladakh.
The shepherd is seen using the traditional #yukdo to pelt stone at the chinese styled humvee.
would recommend yukdo training for all those posted in Ladakh pic.twitter.com/gDguMXXnst— Namgyal (@Stanzinnamgail_) January 31, 2024