మనాలీ: హిమాచల్ప్రదేశ్లో వచ్చిన వరదలు(Himachal Pradesh Floods) ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. పర్యాటకులకు ఆహ్లాదాన్ని ఇచ్చే ఆ ప్రదేశం ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి కేంద్రంగా మారింది. తాజా వర్షాలతో బియాస్ నది ఉప్పొంగిపోయింది. ఉగ్రరూపం దాల్చిన ఆ నది ప్రవాహ ధాటికి అన్నీ కొట్టుకుపోయాయి. కులు, మనాలీ మధ్య ఉన్న మూడవ నెంబర్ జాతీయ రహదారి కూడా ఆనవాళ్లు లేకుండాపోయింది. ఆ డబుల్ లేన్ జాతీయ హైవే ఇప్పుడో మట్టి దిబ్బలా తయారైంది. పూర్తిగా ధ్వంసమైన ఆ హైవే వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
This is what Beas done to Kullu – Manali National Highway stretch
मनाली से कुल्लू छोटे वाहनों को वाया left bank होते हुए अरछन्डी , अरछन्डी से राईसन फिर Right bank होते हुए कुल्लू भेजा जा रहा है#HimachalPradesh pic.twitter.com/Hcnl3a58ZY
— Weatherman Shubham (@shubhamtorres09) July 12, 2023
ఇక మండీలో ఉన్న ఓ బ్రిడ్జ్పై నుంచి కూడా వరద నీళ్లు ఉప్పొంగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ బ్రిడ్జ్ వద్ద నీటి ప్రవాహం తగ్గింది. అయితే ఆ బ్రిడ్జ్పై చెత్త విపరీతంగా చేరుకున్నది. ప్లాస్టిక్ బాటిళ్లతో పాటు ఇతర వస్తువులు వరదల ధాటికి బ్రిడ్జ్పై ఉండిపోయాయి.
It's Nature's Payback Time. Tampering with nature has to bear the consequences.#HimachalFloods #HimachalPradesh pic.twitter.com/JENbr47aPB
— ɅMɅN DUВΞY 🇮🇳 (@imAmanDubey) July 11, 2023