హైదరాబాద్ : మేడ్ ఇన్ ఇండియా మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ “కూ” యాప్ సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా నిర్వహించేందుకు యూజర్లకు అవగాహన కల్పిస్తోంది. “కూ” యాప్ లోని యూజర్లు, స్థానిక భాషలలో తమపోస్టులను షేర్ చేసేవారు, సోషల్ మీడియా కు మొదటిసారి వచ్చినవారు ఆన్లైన్ లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనావుంది.
సోషల్ మీడియా ద్వారా ప్రజలను కనెక్ట్ చేయడానికి కీలకమైన సాధనం. దీనిని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఆర్థిక మోసం,ప్రైవసీ, డేటా చోరీ వంటి నేరాలను నిరోధించేందుకు “కూ”యాప్ కృషి చేస్తోంది.