కోల్కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్.. కోల్కతాలో భారీ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. సుమారు 7500 చదరపు అడుగులు ఉన్న త్రివర్ణ పతాకాన్ని.. విక్టోరియా మెమోరియల్ హాల్ వద్ద ఆయన ఎగరవేయనున్నారు. ఇండియా టూరిజం కోల్కతా, హిమాలయన్ మౌంటనేరింగ్ ఇన్స్టిట్యూట్లు సంయుక్తంగా జెండాను ఆవిష్కరించనున్నాయి. దీనితో 750 మొక్కలు కూడా విక్టోరియా హాల్ గార్డెన్లో నాటనున్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి సంకేతంగా ఈ కార్యక్రమాలను చేపట్టారు.
ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన అతిపెద్ద జాతీయ పతాకాన్ని సిక్కిమ్లోని మౌంట్ రెన్చోక్పై సుమారు 16,500 మీటర్ల ఎత్తులో ఎగురవేశారు. ఆ తర్వాత డార్జిలింగ్లో ఉన్న మౌంటనేరింగ్ ఇన్స్టిట్యూట్లోనూ యోగా దినోత్సవం రోజున త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు.