న్యూఢిల్లీ : అమెరికాలో కోల్కతాకు చెందిన డ్యాన్సర్ను దుండగులు కాల్చిచంపిన ఘటనపై చికాగోలోని భారత కాన్సులేట్ స్పందించింది. ఈవెనింగ్ వాక్కు వెళ్లిన భారత డ్యాన్సర్ అమర్నాథ్ ఘోష్ మృతిపై దర్యాప్తును వేగవంతం చేయాలని భారత కాన్సులేట్ సెయింట్ లూయిస్ పోలీస్లను కోరింది.
మిసోరిలో గుర్తుతెలియని వ్యక్తి ఘోష్ను కాల్చిచంపిన ఘటనలో బాధిత కుటుంబ సభ్యులకు, స్నేహితులకు భారత కాన్సులేట్ ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ ఘటనపై ఫోరెన్సిక్, దర్యాప్తును తాము పర్యవేక్షిస్తున్నామని, కావాల్సిన సాయం అందిస్తామని చికాగోలోని భారత కాన్సులేట్ సోషల్ మీడియా వేదికగా భరోసా ఇచ్చింది.
అమర్నాథ్ ఘోష్ బంధువులకు కాన్సులేట్ సత్వర సాయం అందిస్తుందని, ఈ కేసు దర్యాప్తు విషయంలో సెయింట్ లూయిస్ పోలీసులు, యూనివర్సిటీ అధికారులను అప్రమత్తం చేసిందని తెలిపింది. అమర్నాథ్పై కాల్పుల ఘటన విషయంలో పూర్తి వివరాలు నిగ్గుతేలేందుకు అవసరమైన సాయం అందిస్తామని స్పష్టం చేసింది.
Read More :
T-Flight | సూపర్ సోనిక్ అల్ట్రా హైస్పీడ్ ట్రైన్ను అభివృద్ధి చేసిన చైనా