హరియాణలో నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణ లోక్సభ ఎన్నికలపై, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపదని హరియాణ మాజీ సీఎం మనోహర్లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంతో పలువురు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఆయన బుధవారం వెల్లడించారు.
హరియాణలో బీజేపీ సంకీర్ణ సర్కార్కు ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మంగళవారం మద్దతు ఉపసంహరించిన నేపధ్యంలో ఖట్టర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల నిర్ణయంతో సైనీ సర్కార్ మైనారిటీలో పడింది. ఇక ఎన్నికల సీజన్లో ఎవరు ఏ పక్షాన చేరినా దాని ప్రభావం ఉండదని మాజీ సీఎం పేర్కొన్నారు. తమతో కూడా పలువురు ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారని, తమకు మద్దతుగా పలువురు నేతలు ముందుకొచ్చారని అన్నారు.
హరియాణలో మొత్తం పది లోక్సభ స్ధానాల్లో బీజేపీ విజయం సాదిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఖట్టర్ కర్నాల్ లోక్సభ అభ్యర్ధిగా బరిలో దిగారు. కాగా, హరియాణ విపక్ష నేత భూపీందర్ సింగ్ హుడా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ సమక్షంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సొంవీర్ సంగ్వాన్, రణ్ధీర్ సింగ్, ధరంపాల్ గొండర్ సైనీ సర్కార్కు మద్దతు ఉపసంహరించినట్టు వెల్లడించారు.
Read More :
EVM | ఈవీఎంకు హారతి ఇచ్చిన మహిళా కమిషన్ చైర్పర్సన్.. కేసు నమోదు