న్యూఢిల్లీ: భారత్కు చెందిన అధినాయకులకు ఖలిస్థానీ మద్దతుదారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్పై సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నున్ బెదిరింపులకు దిగాడు. ‘మీ కోసం వస్తున్నాం’ అంటూ హెచ్చరించాడు. కెనడాలో ఖలిస్థానీ తీవ్రవాదంపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడోతో భారత్ ప్రధాని ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ వారు వెనక్కి తగ్గడం లేదు. ఈ నెల 10న కెనడాలోని ఖలిస్థానీ రెఫరెండం నిర్వహించారు.