తిరువనంతపురం : (Kerala Lockdown) ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో కొవిడ్ లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయగా, తాజాగా కేరళ ప్రభుత్వం కూడా ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 25 నుంచి అమలులోకి వస్తాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.
రాష్ట్రంలో కరోనావైరస్ పరిస్థితులను సమీక్షించిన అనంతరం, కేరళ ప్రభుత్వం శనివారం లాక్డౌన్ మార్గదర్శకాలను సడలించింది. కొన్ని ఆంక్షలతో అక్టోబర్ 25 నుంచి సినిమా థియేటర్లు, ఇండోర్ ఆడిటోరియంలను తిరిగి తెరిచేందుకు అనుమతించింది. తాజా మార్గదర్శకాలను జారీ చేస్తూ, పినరయి విజయన్ ప్రభుత్వం ఉద్యోగులతోపాటు పూర్తిగా టీకాలు వేసుకున్న వారికే రాష్ట్రంలోకి ప్రవేశం ఉంటుందని చెప్పారు. సినిమా థియేటర్లు, ఆడిటోరియంలు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో పనిచేస్తాయని సీఎం పినరయి విజయన్ తెలిపారు. రాష్ట్ర జనాభాలో 90 శాతం కంటే ఎక్కువ మందికి కనీసం ఒక మోతాదు కరోనావైరస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. కనీసం ఒక్క మోతాదు తీసుకోని వారి కదలికలను పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను గతంలో ప్రకటించింది. దీనికి ముందు, పాఠశాలలను తిరిగి తెరువడానికి రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం, ఇద్దరు విద్యార్థులు మాత్రమే బెంచ్ మీద కూర్చోవడానికి అనుమతించాలి.
కాగా, శుక్రవారం రాష్ట్రంలో 13,834 కొత్త కొవిడ్ కేసులు, 95 మరణాలు నమోదయ్యాయి. ఇన్ఫెక్షన్కు గురైన వారి సంఖ్య 46,94,719, మరణాల సంఖ్య 25,182 కు చేరుకున్నది.
గాంధీ జయంతి రోజున ‘గాడ్సే’ సినిమా ప్రకటన
పదవి ఉన్నా లేకున్నా రాహుల్, ప్రియాంక వెంటే : సిద్ధూ
బరువు తగ్గించుకోవాలంటే రోజుకు ఎన్ని అడుగులు వేయాలి?
చైనా సైన్యంలో పాక్ అధికారుల రహస్య మోహరింపు.. ఎందుకంటే?
ఖట్టర్ నివాసం వద్ద రైతుల ఆందోళన, ఉద్రిక్త పరిస్థితులు
తాలిబాన్ అణిచివేతకు అమెరికా బిల్లు.. లక్ష్యం మాత్రం పాకిస్తాన్!?
హిమపాతంలో చిక్కుకున్న నేవీ సిబ్బంది.. గాలింపు ముమ్మరం
ఈ గడ్డపై పుట్టిన ఈ ఇద్దరు మహనీయులు అమరులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..