పథనంతిట్ట: శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో అరవణ ప్రసా దం కొరత ఏర్పడటంతో ఒక భక్తుడికి రెండు డబ్బాలు మాత్రమే ఇవ్వాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ పరిమితి విధించింది. దీంతో పొరుగు రాష్ర్టాల భక్తులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
అరవణ ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు ఉపయోగించే డబ్బాల కొరత ఉందని దేవస్థానం బోర్డు ప్రతినిధులు తెలిపారు. డబ్బాల కోసం మరో రెండు కంపెనీలకు ఆర్డర్ ఇచ్చామని, త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు.