న్యూఢిల్లీ : ఎన్సీపీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. లక్షద్వీప్ ఎంపీగా ఉన్న ఫైజల్ తనపై ఉన్న హత్యాయత్నం కేసును కొట్టి వేయాలంటూ చేసిన విజ్ఞప్తిని కేరళ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఈ కేసులో అతనికి శిక్ష పడిన 2023 నుంచి అనర్హుడిని చేస్తున్నట్టు లోక్సభ ప్రకటించింది.
ఇలా అనర్హుడు కావడం ఫైజల్కు ఇది రెండోసారి. హత్యాయత్నం కేసులో ఫైజల్కు పదేండ్ల శిక్ష విధించడంతో ఈ ఏడాది జనవరి 25న అతని లోక్సభ సభ్యత్వం రద్దయ్యింది.