తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ఖాన్ సీఎం విజయన్పై చర్య తీసుకుంటానని బాంబు పేల్చారు. బంగారం స్మగ్లింగ్ కేసులో సీఎం కార్యాలయానికి సంబంధం ఉన్నట్టు తేలితే జోక్యం చేసుకుంటానని వెల్లడించారు. గవర్నర్ ఖాన్ సమాంతర ప్రభుత్వం నడుపుతున్నట్టుగా వ్యవహరిస్తున్నారని సీఎం విజయన్ దుయ్యబట్టారు. ఇది కేరళ.. ఆయనకు ఇక్కడ అధికారాలు కూడా లేవు అని గుర్తు చేశారు. దీనిపై గవర్నర్ ఖాన్ స్పందిస్తూ కేరళ ప్రజలు ఇప్పుడు బంగారం స్మగ్లింగ్ గురించి, అందులో సీఎం కార్యాలయం పాత్ర మాట్లాడుకొంటున్నారని మీడియాకు చెప్పారు. గవర్నర్ వ్యాఖ్యలపై అధికార సీపీఎం స్పందించింది. ఆయనవ్యాఖ్యలు ఎల్లో జర్నలిజంగా అభివర్ణించింది. తాను ఆరెస్సెస్ వ్యక్తిని అని గవర్నర్ తానే నిరూపించుకున్నారని పేర్కొన్నది.