తిరువనంతపురం: రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై సంతకం చేయకుండా కాలయాపన చేస్తున్న గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తీరుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ వెల్లడించారు.
గవర్నర్ ఆమోదానికి ఎనిమిది బిల్లులు పంపామని, చాలా కాలంగా ఆయన వాటిని తొక్కిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ చర్యలు వలస పాలనను గుర్తుకు తెస్తున్నాయని విమర్శించారు.