తిరువనంతపురం: ఒక బావిలో పడిన ఏనుగును అటవీ శాఖ అధికారులు రక్షించారు. కేరళలోని ఎర్నాకుళంలో బుధవారం ఈ ఘటన జరిగింది. కుట్టంపూజ ప్రాంతం సమీపంలోని బావిలో ఒక ఏనుగు పడిపోయింది. బయటకు రాలేక ఇబ్బంది పడింది. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు వచ్చిన అధికారులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. పొక్లైన్తో తవ్వించడంతో చివరకు ఆ ఏనుగు బావి నుంచి బయటకు వచ్చింది.