Road Accident | కేరళ (Kerala )లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. రెండు బస్సుల మధ్యలో ద్విచక్ర వాహనం నలిగి దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కోజికోడ్ (Kozhikode) జిల్లాలో సోమవారం చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
జిల్లాలోని చేవాయూర్ (Chevayur) వద్ద ఓ ద్విచక్ర వాహనం రెండు ప్రైవేట్ రవాణా బస్సుల మధ్య ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మరో బైక్ కూడా బస్సుల మధ్య ఇరుక్కుపోయినట్లు చెప్పారు. అయితే బైక్ రైడర్ గాయాలతో బయటపడినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అతడు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
LinkedIn Layoff | రెండో రౌండ్ లేఆఫ్స్ ప్రకటించిన లింక్డిన్.. ఈ సారి ఎంతమంది ఉద్యోగులంటే..?
Samantha | 14 నెలల తర్వాత.. తనకు ఇష్టమైన ఫుడ్ తిన్న సమంత