Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన నటన, మంచి మనసుతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. అయితే, అనారోగ్యం కారణంగా సామ్ కొంతకాలంపాటు సినిమాల నుంచి విరామం తీసుకుంది. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తరచూ టచ్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
సమంత గత కొన్ని రోజులుగా మయోసైటిస్ అనే అరుదైన (Myositis Diagnosis) వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఎవరి సాయం లేకున్నా ఒంటిరిగా పోరాడుతూ సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ తను సక్సెస్ అని నిరూపించుకుంటోంది. వ్యాధి బారిన పడిన కొత్తలో ఆమె చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంది. ఎక్కువ సేపు నిలబడలేని పరిస్థితిలో నరకం అనుభవించింది. దానికి చికిత్స తీసుకోవటం వల్ల ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ఆ వ్యాధినుంచి బయటపడుతోంది. ఈ నేపథ్యంలోనే డిసీజ్ కారణంగా ఆమె తన ఆహారపు అలవాట్లను మార్చుకుంది.
తనకు ఎంతో ఇష్టమైన ఫుడ్ను కూడా తీసుకోవట్లేదు. ముఖ్యంగా బ్రెడ్ను పూర్తిగా తినటం మానేసింది. ఈ క్రమంలోనే దాదాపు ఏడాది తర్వాత ఇప్పుడు తనకు ఎంతో ఇష్టమైన బ్రెడ్డును బట్టర్తో కలిపి తిన్నట్లు సామ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ‘ఒక సంవత్సరం నాలుగు నెలల తర్వాత బ్రెడ్డు ముక్కల్ని తింటున్నా’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్గా మారింది.
Also Read..
Allu Arjun | చిన్నారి అభిమానితో అల్లు అర్జున్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
Cinema news | సెట్లో కొట్లాడుకున్న హీరోయిన్లు.. ఎవరా ఇద్దరు?
Urvashi Rautela | ఫోన్ పోగొట్టుకుంది