తిరువనంతపురం: కేంద్రంలోని మోదీ సర్కారు సహకార సమాఖ్య వ్యవస్థను బలహీనం చేసిందని కేరళ సీఎం విజయన్ ధ్వజమెత్తారు. కేంద్రం వైఖరికి నిరసనగా గురువారం ఢిల్లీలో నిరసన చేపట్టనున్నట్టు చెప్పారు. ఆందోళనలో తన సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని పేర్కొన్నారు. గురువారం విజయన్ ఢిల్లీలో మాట్లాడుతూ తమ పోరాటం న్యాయంగా రాష్ర్టానికి దక్కాల్సిన నిధుల కోసమేనన్నారు.
కేంద్రం వివక్ష కారణంగా రాష్ట్ర సంక్షేమ పథకాలపై ప్రభావం పడుతున్నదని పేర్కొన్నారు. రాష్ర్టాల హక్కులను కాపాడుకొనేందుకు బీజేపీయేతర పార్టీలు, సీఎంలు ఈ ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా, దేశంలో ఆర్థిక నిర్వహణ అధ్వానంగా ఉన్న రాష్ర్టాల్లో కేరళ ఒకటని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. రాష్ర్టాలు ఇష్టమొచ్చినట్టు అప్పులు చేసుకుంటూ పోతే దాని ప్రభావం దేశం మొత్తంపై పడుతుందని పేర్కొన్నది.