అహ్మదాబాద్: ప్రధాని మోదీ విద్యార్హతలపై వ్యాఖ్యలకు సంబంధించి గుజరాత్ వర్సిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ చేసిన అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టులోనే వాదనలను వినిపించాలని పిటిషనర్లకు చెప్పింది.
మోదీ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను దరఖాస్తుదారులకు ఇవ్వాలని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు గత ఏడాది మార్చిలో రద్దు చేసింది. అనంతరం వర్సిటీ రిజిస్ట్రార్ ఈ నేతలిద్దరిపైనా పరువు నష్టం కేసు వేశారు. వర్సిటీని లక్ష్యంగా చేసుకుని వీరిద్దరూ కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.