న్యూఢిల్లీ, జూన్ 12: భారత్లో థర్డ్వేవ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు.‘బ్రిటన్లో దాదాపు 45 శాతం జనాభా కరోనా టీకాలు తీసుకుంది. అయినా ఆ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనిని బట్టి మన దేశంలో కూడా థర్డ్వేవ్ వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఇది రావొద్దని దేవుడిని ప్రార్థిస్తున్నా. ఒకవేళ వస్తే మాత్రం ఎదుర్కోవడానికి ఢిల్లీ ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది’ అని పేర్కొన్నారు.