న్యూఢిల్లీ : ఇతర రాజకీయ పార్టీలను బీజేపీ ధ్వంసం చేస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీని అనైతిక పార్టీగా అభివర్ణించారు. తృణమూల్ కాంగ్రెస్లో ఇటీవల తలెత్తిన తిరుగుబాటును ఉద్దేశించి ఆయన మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయ పార్టీలను విడగొట్టడం, విపక్షాన్ని బలహీన పరచడం, ఈడీని, డబ్బును దుర్వినియోగం చేయడం వంటి బీజేపీ చర్యలన్నీ ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం.
దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాలి’ అని అన్నారు. ‘జరుగుతున్నది తప్పు. ప్రజలు ఓటేసి 29 మందిని టీఎంసీ ఎంపీలుగా ఎ న్నుకొన్నారంటే ప్రజలు ఆ పార్టీని నమ్మారని అర్థం. అందు లో 20 లేదా 22 మందిని ప్రలోభపెట్టి తెలియని పార్టీకి వారు మద్దతు పలికేలా చే యడం సరైంది కాదు’ అని తెలిపారు.