రుద్రప్రయాగ్: కేదార్నాథ్ యాత్రకు రావాలనుకునే భక్తుల రిజిస్ట్రేషన్ను మే 8 వరకు నిలిపివేశారు. రానున్న మూడు నాలుగు రోజుల్లో కేదార్ కనుమల్లో వాతావరణం ప్రతికూలంగా ఉండే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు శుక్రవారం తెలిపారు.
మంచుగడ్డల కారణంగా భైరాన్లో గురువారం మూసుకుపోయిన నడకదారిని మధ్యాహ్నం నుంచి పునరుద్ధరించామని చెప్పారు. గుర్రాలు, గాడిదల ద్వారా వెళ్లే మార్గమంతా మంచుతో నిండినందున దాన్ని ఇంకా వినియోగంలోకి తేలేదన్నారు.