డెహ్రాడూన్, ఫిబ్రవరి 18: చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 25న తెరవనున్నారు. ఈ మేరకు మహాశివరాత్రి సందర్భంగా శనివారం ఆలయ పునఃదర్శన తేదీని నిర్వాహకులు ప్రకటించారు. ఆ రోజు ఓంకారేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటలకు మహాభిషేక పూజతో పాటు సంప్రదాయంగా నిర్వహించాల్సిన అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత 6.30 గంటలకు ఆలయ మహాద్వారాన్ని తెరవనున్నారు. అలాగే అదే రోజు ఉదయం 8.30 గంటలకు కేదార్నాథుడికి హారతి ఇవ్వనున్నారు. అలాగే ఏప్రిల్ 27న ఉదయం 7.10 గంటలకు బద్రీనాథ్ ఆలయాన్ని తెరుస్తారు. నవంబర్ 19న బద్రీనాథ్ గుడి తలుపులు మూసివేయటంతో చార్ధామ్ యాత్ర ముగియనున్నది.