డెహ్రాడూన్, మార్చి 8: భక్తుల సందర్శనార్థం మే 10 నుంచి కేధార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయని శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ప్రకటించింది. ఉఖిమఠ్లోని ఓంకారేశ్వర్ ఆలయంలో బీకేటీసీ చైర్మన్ అజేంద్ర అజయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు కేదార్నాథ్ను దర్శించుకుంటారు.
శీతాకాలంలో ఈ ఆలయం పూర్తిగా మూసివేస్తారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన అజయ్ గత యాత్రా సీజన్లో రికార్డు స్థాయిలో భక్తులు కేదార్నాథ్ను సందర్శించినట్టు చెప్పారు. ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరుగనున్నట్టు తెలిపారు.